SRPT: నడిగూడెం మండలం ఫారెస్ట్ పరిధిలో గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇవాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నడిగూడెం, మునగాల మండలాలకు చెందిన భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.