GNTR: మంగళగిరిలో రోహిణి కార్తె ముగిసినా, వేసవి ప్రభావం తగ్గడం లేదు. నాలుగు రోజులుగా భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు రోడ్లపైకి రావడానికి వెనుకాడటంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఎండల తాకిడికి వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.