TG: హైదరాబాద్ జగద్గిరిగుట్టలో విషాదం జరిగింది. సాయి అనే వ్యక్తి ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని చూస్తుండగానే సాయి సజీవ దహనం అయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నారు.