KDP: కడపలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా DTC కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించి, ప్రాణనష్టం నివారించాల్సిన అవసరం ఉందన్నారు. శాఖల సమన్వయంతో రోడ్డు భద్రతను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.