ఇదే ప్రస్తుతం కన్నడ మీడియా నుంచి తెలుగు మీడియా వరకూ అంటే సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా జరుగుతున్న హోరాహోరీ చర్చ. దీనికి మొదలు ఎక్కడంటే, మొన్నీ మధ్యనే బెంగళూరులో కన్నప్ప సినిమా ఈవెంటె జరిగింది. ఆ ఈవెంట్ యాంకర్ మోహన్బాబుని పద్మభూషణ్ అని సంభోదిస్తూ ఆయనను ప్రసంగించమని కోరింది. ఆ ఎడ్రసింగ్ని విని కొందరు అక్కడికక్కడే అవాక్కయ్యారు. దేశంలో ఎవరికేం బిరుదులు వచ్చాయి అనే లౌకికజ్ఞానం దాదాపుగా అందరికీ వుంటుంది. కానీ కొందరు ఏంకర్లకి స్టయిల్ అండ్ ఫ్యాషన్ తప్పితే నాలెడ్జ్ పూర్తిగా శూన్యం. ఒక్కోసారి ఏం మాట్లాడతారో, ఎలా ప్రముఖులని ఎలా వర్ణిస్తారో కూడా అర్ధం కాదు. అంతలా అర్ధంపర్ధం లేకుండా వ్యవహరిస్తుంటారు. అలాంటిదే ఈ సంఘటన.
మోహన్ బాబుకి పద్మశ్రీ వచ్చింది. అందులో తిరుగులేదు. పద్మభూషణ్ లభించనే లేదు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు తర్వాత మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే. ఈ విషయం అందరికీ తెలుసు. కన్నడ యాంకర్ కాబట్టి తెలుగులో ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదన్న విషయం తెలిసి ఉండకపోవచ్చు. అది క్షమార్హమే. భారత ప్రభుత్వం అత్యంత గౌరవప్రదంగా ఇచ్చే Highest Civilian Awards అవి. వాటిని ఎక్కడ పడితే అక్కడ వాడకూడదనే చట్టపరమైన నియంత్రణ కూడా ఉంది. ఒకవేళ ఇష్టానుసారం గనక వాటిని వాడితే భారత ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎన్టీఆర్, ఎఎన్నార్ వంటి మహానటులకు కూడా పద్మశ్రీ అని టైటిల్స్ వేసిన సందర్భాలు రెండోమూడో మొత్తం వాళ్ళ సుదీర్ఘమైన కెరీర్లలో. రెండు మూడు సార్లు సినిమా టైటిల్స్ వేస్తే, ఎవరో సూచించగానే ఆ మహానటులిద్దరూ నిర్మాతలను పిలిచి, తమ పేర్ల ముందు వాటిని వాడొద్దని సున్నితంగా హెచ్చిరంచిన సందర్భాలున్నాయి. అలాటిది, ఆ కన్నడ యాంకర్కి తెలియకపోవచ్చు, కానీ, అన్నీ తెలిసి, ఒక విశ్వవిధ్యాలయాన్నే నడుపుతున్న మోహన్బాబుకి తెలియకపోవడం క్షమార్హం కాదు. ఆయన యాంకర్ చెప్పిన వెంటనే లేచి, తనకు పద్మభూషణ్ రాలేదని, తప్పిదానికి క్షమించమని చెప్పాలి. కానీ మోహన్బాబు తనని పద్మభూషణ్ అని పిలుస్తుంటే ఎంజాయ్ చేస్తూ కూర్చోవడం చాలా హాస్యాస్పదం.
భారతప్రభుత్వ విధివిధానాల ప్రకారం నేరం. గతంలో కూడా అంటే ఓ తొమ్మిదేళ్ళ క్రితం మోహనబాబుకిచ్చిన పద్మశ్రీని ఎక్కడపడితే అక్కడ వాడుకుంటున్నారని, భారత ప్రభుత్వం ఆ అవార్డును వెనక్కిచ్చేయమని శాశించింది. హైకోర్టులో వ్యాజ్యం పడితే మోహన్బాబు ప్రభృతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. క్షమించమని అఫిడవిట్ని దాఖలు చేసుకున్న దరిమిలా లోకోన్నత న్యాయస్థానం క్షమించి, మోహన్బాబును వదిలేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా మోహన్బాబు దాని విలువను గ్రహించకపోవడం విచారకరం. అది ఆయన వ్యక్తిత్వాన్ని మీడియా దృష్టిలో మరింత నీరుగార్చింది. నిజానికి అది చట్టరీత్యా కూడా చాలా సీరియస్. కానీ పద్మభూషణ్ అని పిలుస్తుంటే మోహన్బాబు ఆనందిస్తూ కళ్ళప్పగించి చూడ్డం మాత్రం ఎంత మాత్రం క్షమార్హం కాదని అనేకమంది వ్యాఖ్యానిస్తున్నారు.