SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కార్యాలయంలో నేడు జంట పట్టణాలకు సరఫరా అవుతున్న సింధూర జలసిరి త్రాగునీటి సరఫరాపై కమిషనర్ ఎన్.రామారావు అధ్యక్షతన రివ్యూ సమావేశం నిర్వహించారు. సమావేశానికిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. మున్సిపాలిటీ నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ముందు పైప్ లైన్ సిద్ధం చేయమని ఆదేశించారు. కిడ్నీ ఆసుపత్రికి సరిపడ నీళ్లు అందజేయమని ఆదేశించారు.