కడప: కమలాపురం మండలం గంగవరం సమీపంలోని పెన్నా నది వద్ద కోడిపందాలు ఆడుతున్న 11మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై విద్యాసాగర్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కోడిపందాలు ఆడుతున్నారన్న సమాచారం అందరంతో సీఐ రోషన్ పర్యవేక్షణలో దాడులు చేసి నిందితులతో పాటు ఐదు కోళ్లను, రూ.20,200 స్వాధీనం చేసుకున్నామన్నారు.