Akp: అచ్యుతాపురం బ్రాండిక్స్ యూనిట్- 2 బస్సు బోల్తా పడిన ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము డిమాండ్ చేశారు. అచ్యుతాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. రాము మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో 30మంది మహిళా కార్మికులు గాయాలపాలయ్యారని.. కండిషన్ లేని బస్సు నడపడమే ప్రమాదానికి కారణమన్నారు.