ELR: ఉంగుటూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 12వ తేదీన ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని ఎంపీడీవో జిఆర్ మనోజ్ తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అధ్యక్షతన జరుగుతుందన్నారు. మండల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.