కశ్మీర్ అభివృద్ధిని ఎవరు ఆపలేరని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మే 6వ తేదీన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పామని, ఆపరేషన్ సింధూర్ పాక్ నాయకత్వానికి నిద్ర లేకుండా చేసిందని తెలిపారు. పాక్లో 100 కిలోమీటర్లు దూసుకెళ్లి దాడులు చేశామని మోదీ వెల్లడించారు. పహల్గామ్లో అమాయక ప్రజలు హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేదిలేదని మరోసారి హెచ్చరించారు.