RCB విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుపై హైకోర్టు మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరపనుంది. కాగా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద అభిమానుల రద్దీ అధికం కావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 37 మంది గాయపడ్డారు.