NRML: భార్య పుట్టింటికి వెళ్లడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నర్సాపూర్ మండలంలో జరిగింది. కుస్లి గ్రామానికి చెందిన గంగారం (35)భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెలలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.