ఖమ్మం: యువతకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న 55 వేలకు పైగా ఖాళీలను మొదటి ఏడాది లోనే భర్తీ చేసిందని చెప్పారు. అమ్మాయి పుడితే పండగ వాతావరణం ఉండాలనే లక్ష్యంతో “మా పాప మా ఇంటి మణిదీపం” కార్యక్రమాన్ని జిల్లాలో గత 12 వారాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.