KRNL: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా 9వ తేదీ పదవి బాధ్యతలు చేపడుతున్నట్టు కురువ మల్లయ్య సోమవారం తెలిపారు. గోనెగండ్ల TDP కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆశీర్వాదంతో కురువ సామాజిక కులానికి పెద్దపీట వేస్తూ చైర్మన్గా తనకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలు జయప్రదం చేయాలన్నారు.