VZM: జీతాలు పెంచాలని అమరావతిలో శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అక్రమ అరెస్టు చేశారు. వారిని బేషరతుగా విడుదల చేయాలని మంగళవారం కొత్తవలస కూడలిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, తమిళనాడు తరహాలో అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.