అనకాపల్లి మండలం మామాడిపాలెం, తగరంపూడి గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పలు ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మామిడిపాలెం జడ్పీ హైస్కూల్లో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఎస్సీ కాలనీలో పార్క్ను ప్రారంభించారు. అనంతరం తగరంపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.