NTR: ప్రజలపై మోపిన ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలని ఎమ్మెల్సీ రూహుల్లా డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కేఎల్ రావు పార్క్ వద్ద ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే పెంచిన ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలని లేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.