MBNR: సింహాచలంలో భక్తులు మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయమని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు.