VZM: బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ పావు వెంకట మురళీ కృష్ణపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు జరగనున్న ప్రత్యేక సమావేశానికి పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పట్టణ సీఐ కె.సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ రమేశ్, కానిస్టేబుల్స్ బందోబస్తులో పాల్గొన్నారు. సమావేశంలో ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సీఐ సతీశ్ కుమార్ చెప్పారు.