కృష్ణా: అమరావతి నిర్మాణంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం అని టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు అన్నారు. మంగళవారం అవనిగడ్డలోని టీడీపీ మండల కార్యాలయంలో చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని సహకారంతో కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతోందన్నారు. ఫిబ్రవరి రెండున అమరావతిలో జరిగే ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలన్నారు.