KRNL: ఆదోని రెండో వార్డులో కమిషనర్ ఎం.కృష్ణ మంగళవారం పర్యటించారు. మాజీ కౌన్సిలర్ తిమ్మప్పతో కలిసి కాలువలలో పూడిక తీశారు. పట్టణ ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల వద్దకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కోరారు. పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు.