KRNL: బనగానపల్లె మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటిలో వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మవార్లకు సోమవారం పల్లకి సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ గావించి పల్లకిలో కొలువుతీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.