PLD: నరసరావుపేట పోస్టల్ కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని ఆ శాఖ విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం ఆందోళనకు దిగారు. పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కాలంలో ఆపిన మూడు డీఏలు చెల్లించాలన్నారు. గుర్తింపు లేని ఆసుపత్రులు అందుబాటులో లేకుంటే మెడికల్ అలవెన్స్ పెన్షనర్లకు ఇవ్వాలన్నారు.