అన్నమయ్య: కలికిరి మండలంలో 2019 – 24 మధ్య పక్కా ఇల్లు మంజూరై నిర్మాణంలో వివిధ దశలలో ఉన్న వాటిని పూర్తి చేయడానికి అదనపు నిధులు మంజూరు చేయనున్నట్లు సోమవారం ఎంపీడీఓ భానుమూర్తి రావు తెలిపారు. గతంలో ప్రకటించిన రూ. 1.8 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 70 వేలు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.