PDL: ప్రజావాణి అర్జీల సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణు అధికారులకు సూచించారు. సోమవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వేణు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు.