భోజ్పురి సింగర్ నేహాసింగ్ రాథోడ్పై కేసు నమోదైంది. పహల్గామ్ కాల్పుల ఘటనను రాబోయే బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాడుకుంటారని ‘X’లో వచ్చిన పోస్టును రీట్వీట్ చేసింది. దీంతో ఆమెపై లక్నోలో కేసు నమోదైంది. ఈ పోస్ట్ దేశద్రోహానికి సమానమని, పాక్ మీడియాలో వైరల్ అవుతోందని పోలీసులు FIRలో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.