ATP: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పాలీసెట్ 2025కు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి 28 వరకు S.K ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అష్రఫ్ అలీ తెలిపారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే శిక్షణ కొనసాగుతుందన్నారు.