KNR: రంజాన్ పండుగ సందర్భంగా కరీంనగర్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్లో వారి స్నేహితులు సయ్యద్ షా ఖాజా మొహినుద్దీన్ ఖాద్రి, షాస మొల్ల నివాసానికి వెళ్ళి ఉత్సాహంగా గడిపారు. వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.