KMM: ఖమ్మం నగరానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.188 కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తెలిపారు. ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, మేయర్ నేతృత్వంలో ఈ బడ్జెట్ ను ఆమోదించినట్టు తెలిపారు. వరదలు నియంత్రణ, డ్రైనేజీ అభివృద్ధి, టౌన్ ప్లాన్ తదితర అంశాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.