SKLM: కవిటి మండలం బైరాగిపుట్టుగకు చెందిన బోధన్ ప్రధాన్ అనే విద్యార్థి నవోదయ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో LKG నుంచి 5వ తరగతి వరకూ చదివి నవోదయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం పట్ల మండల విద్యాశాఖాధికారి మజ్జి ధనుంజయ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది విద్యార్థిని అభినందించారు.