PLD: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాతో నరసరావుపేట ఎంపీ తావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కూటమి పాలన, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధులపై అమిత్షాతో చర్చించారు. అదే విధంగా పార్లమెంట్లో తన ప్రసంగానికి సంబంధించి ప్రాధాన్యత అంశాలను ఆయన తెలియజేసినట్లు స్థానిక ఎంపీ కార్యాలయం పేర్కొంది.