ATP: రాయదుర్గం పట్టణంలో గుర్తుతెలియని దుండగులు అడవికి గత అర్ధరాత్రి నిప్పు పెట్టారు. ఎకరానికి పైగా వృక్ష సంపద అగ్నికి ఆహుతి అయింది. పట్టణంలో పది రోజుల క్రితం శాంతినగర్ కొండకు, కనేకల్ రోడ్డులో కొండకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి అటవీ వృక్ష సంపదను హరించి వేశారు. దీంతో పశువులకు కొండపై మేత లేకుండా చేస్తున్నారని పశుకాపదారులు వాపోతున్నారు.