TPT: తిరుమల నుండి హైదరాబాద్ వెళుతున్న ఓ కారు పంపలేరు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొంది. డివైడర్ను ఢీకొన్న కారు బోల్తాపడగా అందులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.