ADB: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శనివారం మధ్యాహ్నం ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఖానాపూర్ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాల అమలు చేస్తుందని వివరించారు.