NZB: నిజామాబాద్ జిల్లాకు నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో లా& ఆర్డర్ అదుపు చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపి యువతను బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.