SKLM: బాణాసంచా తయారీ కేంద్రాలపై నిఘా ఉంచాలి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కాకినాడలో భారీ పేలుడు ఘటనలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.