SS: ధర్మవరంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాలయ పరిసరాలు, ప్రధాన కూడళ్లలో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షీ టీమ్స్, ట్రాఫిక్, సివిల్ పోలీసులతో ప్రత్యేక బృందాలను నియమించారు.