మాచో స్టార్ గోపీచంద్, ఘాజీ ఫేమ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబోలో సరికొత్త మూవీ తెరకెక్కనుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ పూజా కార్యక్రమాలతో ఇవాళ ప్రారంభమైంది. 7వ శతాబ్దపు భారతీయ చారిత్రక సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో గోపీచంద్ ఇదివరకు ఎన్నడూ చూడని అవతారంలో కనిపించనున్నారని పేర్కొన్నారు.