GDWL: రాజోలి గ్రామంలో అడివేశ్వరా స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను మాజీ సర్పంచులు అయిన కుర్వ కిష్టాన్న, గంగిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దస్తగిరి గురువారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మొత్తం 10 జతల ఎద్దులు వచ్చాయని, పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కమిటీ నిర్వాహకులు తెలిపారు.