SRPT: నూతనకల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు. ఈ మేరకు తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు.