NRML: మండలంలోని చిట్యాల్ వ్యవసాయ బావిలో వన్యప్రాణి చుక్కల దుప్పి పడి బయటకు వెళ్లేందుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా అటు మీదుగా వెళ్తున్న గ్రామస్థులు జైపాల్, నరేందర్ రెడ్డి గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. దుప్పిని బావిలో నుంచి బయటకు తీసి అధికారులకు అప్పగించారు. దుప్పిని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు ఎఫ్తార్ గీతరాణి తెలిపారు.