ATP: గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద బుధవారం ముందుగా వెళుతున్న లారీని మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. మెయిన్ సర్కిల్లో లారీ నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.