BDK: మార్చి 2న ప్రారంభమయ్యే ఉపవాస దీక్షల నుంచి రంజాన్ పండుగ వరకు ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సూచించారు. శనివారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అధికారులు, ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు.