కోనసీమ: నకిలీ వీసా మోసాలను అరికట్టాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ను కలిశారు. ఈ మధ్య కాలంలో విదేశాల్లో పనుల పేరుతో దళారుల చేతుల్లో చాలా మంది మోసపోతున్నారని.. అమరావతిలో ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయనను కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.