KDP: సింహాద్రిపురం, లింగాల, పులివెందుల మండలాల్లో రెండు చిరుత పులులు సంచరిస్తున్నాయని రైతులు తరచూ వాపోతున్న విషయం తెలిసిందే. చిరుతలను చూశామని తెలపడంతో ఫారెస్ట్ అధికారులు పొలాల్లో ట్రాక్ కెమెరాలు బిగించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం లింగాల, కామసముద్రం గ్రామాల్లో రెండు ట్రాక్ కెమెరాలను అధికారులు ఏర్పాట్లు చేశారు.