NZB: రోడ్లపై ధాన్యాలు ఆరబోస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి హెచ్చరించారు. ఎర్ర జొన్న కోతలు అవుతున్న నేపథ్యంలో రోడ్లపై ధాన్యాన్ని ఆరవేయొద్దని సూచించారు. దాన్ని అన్ని రోడ్లపై ఆరేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సూచించారు. గ్రామ రోడ్లపై, జాతీయ రహదారులపై ధాన్యాన్ని ఆరబోస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సూచించారు.