TPT: ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించడమే తన ధ్యేయమని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణం క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గ ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు అందిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.