W.G: ప్రతి విద్యార్థికి చిన్నతనం నుంచే నాణ్యమైన విద్య అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఎంఈవో రంగరాజు అన్నారు. గురువారం యలమంచిలి మండలంలోని కొంతేరు హైస్కూల్లో జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమాన్ని ఎంఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25వరకు జరిగే ఈ శిక్షణలో అంగన్వాడీ కార్యకర్తలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.