KMR: పిట్లం మండలంలోని తిమ్మా నగర్, మార్దండ, కంబాపూర్ గ్రామాలలోని నర్సరీలు, కంపోస్ట్ షెడ్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, అవెన్యూ ప్లాంటేషన్లను ఇవాళ పిట్లం మండల ఎంపీడీవో కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శిలకు పలు సూచనలు చేశారు. వేసవి కాలం దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.