కృష్ణా: ఏ.కొండూరు మండలం పెద్ద తండాలోని అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్లు తిన్న చిన్నారులకు గురువారం ఫుడ్ పాయిజన్ అయ్యింది. 18 మంది చిన్నారులలో 9 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లే సమయంలో పిల్లలకు వాంతులు, విరోచనాలతో చిన్నారులు బాధపడ్డారు. చిన్నారుల తల్లి, తండ్రులు తక్షణమే తమ పిల్లలను స్వయంగా మైలవరం ఆసుపత్రికి తీసుకువెళ్లారు.